బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సహకరించాలి
ABN , First Publish Date - 2021-06-21T03:47:05+05:30 IST
బెల్లంపల్లిలో మెడికల్ కళా శాల ఏర్పాటయ్యేలా సహకరించాలని ఆదివారం బెల్లం పల్లి మెడికల్ కళాశాల సాధన కమిటీ సభ్యులు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మీకి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భం గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బెల్లంపల్లిలో వం దల ఎకరాల ప్రభుత్వ భూములు, సింగరేణి భవనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే కుమరంభీంఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.
సిర్పూరు ఎమ్మెల్యే, జడ్పీచైర్పర్సన్లకు నాయకుల వినతి
బెల్లంపల్లి, జూన్ 20: బెల్లంపల్లిలో మెడికల్ కళా శాల ఏర్పాటయ్యేలా సహకరించాలని ఆదివారం బెల్లం పల్లి మెడికల్ కళాశాల సాధన కమిటీ సభ్యులు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మీకి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భం గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బెల్లంపల్లిలో వం దల ఎకరాల ప్రభుత్వ భూములు, సింగరేణి భవనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే కుమరంభీంఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాట య్యేలా కృషి చేయాలని కోరారు. మెడికల్ కళాశాల సాధన కమిటీ సభ్యులు శ్రీదేవి, సూరిబాబు, కొయ్యల ఏమాజీ, బండి ప్రభాకర్, అనితరాజులాల్యాదవ్, అమానుల్లాఖాన్, తదితరులు పాల్గొన్నారు.
ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో దీక్ష
జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాలను బెల్లం పల్లిలో ఏర్పాటు చేయాలని ఆదివారం ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో నాయకులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షను ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బనికృష్ణ ప్రారంభించి మాట్లాడుతూ బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే రెండు జిల్లాల ప్రజలకు, విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. గతంలోనే బెల్లంపల్లికి మెడికల్ కళాశాల మంజూరై అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. ప్రభుత్వం బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే వరకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు. కొండ శ్రీనివాస్, ఆరేపల్లి రమేష్, బర్ల స్రవంతి, ఆరేపల్లి సతీష్, రాజు, అరుణ్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో
బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయక పోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని నాయకులు బడికెల శ్రావణ్, చిలుముల కృష్ణదేవరాయలు, సబ్బని రాజేంద్రప్రసాద్లు పేర్కొన్నా రు. ఆదివారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ మెడికల్ కళాశాల కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి దశల వారీ కార్యక్రమాలను రూపొందిం చామన్నారు. మొదటి రోజు ఎమ్మెల్యే, ఆర్డీవో, తహసీల్దా ర్కు వినతిపత్రాలు అందజేయడం, రెండో రోజు సంత కాల సేకరణ, మూడో రోజు సీఎం, మంత్రులకు వినతి పత్రాలు పంపడం, కలెక్టర్కు వినతిపత్రం, ధర్నా, రాస్తారోకోలు చేస్తామన్నారు. సమావేశంలో అల్లి సాగర్యాదవ్, మురళీశ్రావణ్, ప్రవీణ్కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.