నిరుపేద మృతుడి కుటుంబానికి భరోసా

ABN , First Publish Date - 2022-05-29T05:37:46+05:30 IST

మమ్ములను వదిలి వెళ్లినవా నాన్న’ అనే శీర్షికన ఈనెల 24న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి సీఎంవో ప్ర త్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ చలించిపోయారు.

నిరుపేద మృతుడి కుటుంబానికి భరోసా
వివరాలు సేకరిస్తున్న చైల్డ్‌ వెల్ఫేర్‌ సభ్యులు

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

చల్‌గల్‌లో పర్యటించిన చైల్డ్‌వెల్ఫేర్‌ ప్రతినిధి బృందం

జగిత్యాలరూరల్‌, మే 28 : ‘మమ్ములను వదిలి వెళ్లినవా నాన్న’ అనే శీర్షికన ఈనెల 24న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి సీఎంవో ప్ర త్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ చలించిపోయారు. జగిత్యాల రూరల్‌ మం డలం చల్‌గల్‌ గ్రామానికి చెందిన నిరుపేద బాలె లక్ష్మన్‌ మృతుడు కు టుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. చైల్డ్‌వెల్ఫేర్‌ బృందాన్ని లక్ష్మన్‌ ఇంటివద్దకు శనివారం పంపించారు. వారి కుటుంబ వివరాలు సేక రించిన అనంతరం ముగ్గురు కూతుర్లు, కుమారుడికి ఉన్నత విద్య చదివిం చేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని వారికి భరోసా కల్పించారు.  వారికి బియ్యం బ్యాగులను అందించారు. మిగతా వారికుటుంబ స్దితిగతు లను సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు, కలెక్టర్‌ రవినాయక్‌కు వివరి స్తామని పేర్కొన్నారు. వారికి కుటుంబానికి అండగా ఉండేవిధంగా చూస్తా మని భరోసా కల్పించారు.


Updated Date - 2022-05-29T05:37:46+05:30 IST