భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్.. ఈ రోజే..

ABN , First Publish Date - 2020-11-15T03:19:02+05:30 IST

ఈ రోజు దీపావళి. భారత్ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో నాసా శాస్త్రవేత్తలు బాంబులాంటి వార్త చెప్పారు. నవంబరు 14వ తేదీ అంటే ఈ రోజు భూమి వైపునకు...

భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్.. ఈ రోజే..

వాసింగ్టన్: ఈ రోజు దీపావళి. భారత్ మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఇలాంటి సమయంలో నాసా శాస్త్రవేత్తలు బాంబులాంటి వార్త చెప్పారు. నవంబరు 14వ తేదీ అంటే ఈ రోజు భూమి వైపునకు రెండు ఆస్టరాయిడ్లు దూసుకొస్తున్నాయట. ఈ రెండింటిలో ఒక ఆస్టరాయిడ్ ఈ రోజే భూమిని దాటి వెళ్తుందని, ఇది చాలా ప్రమాదకరమైనదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన ఆస్టరాయిడ్ పరిమాణం 175 మీటర్లని, ఈ ఆస్టరాయిడ్ గంటకు 28,646 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెబుతున్నారు. దీనికి ఆస్టరాయిడ్ 2020 ఎస్‌టీ1 అని నాసా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. నాసాకు చెందిన నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం..  ఆ ఆస్టరాయిడ్.. మన తాజ్ మహల్ కన్నా రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆస్టరాయిడ్ మన భూమికి అతి చేరువలోకి వస్తుందని, ఆ సమయంలో అయస్కాంత క్షేత్రంలో ఏమైనా కుదుపులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా.


ఇదిలా ఉంటే భూ గ్రహంవైపు వస్తున్న మరొక ఆస్టరాయిడ్‌కు నాసా.. ఆస్టరాయిడ్-2020 టీబీ9 అని పేరు పెట్టింది. దీని పరిమాణం 30 మీటర్లు. ఇది ఓ విమానం పరిమాణంలో ఉంటుందట. ఇది గంటకు 21,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ ఆస్ట్రరాయిడ్ కూడా భూమికి చేరువ నుంచే వెళ్లనుందని నాసా చెబుతోంది.

Updated Date - 2020-11-15T03:19:02+05:30 IST