చికాగో స్థానిక ఎన్నికల బరిలో.. 10 మంది భారతీయ అమెరికన్లు

ABN , First Publish Date - 2021-04-02T17:32:15+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా రాజకీయాలలో భారతీయ అమెరికన్ల ప్రాబల్యం అంతకంతకు పెరుగుతోంది.

చికాగో స్థానిక ఎన్నికల బరిలో.. 10 మంది భారతీయ అమెరికన్లు

చికాగో: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాలలో భారతీయ అమెరికన్ల ప్రాబల్యం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే ఉపాధ్యక్ష పదవి నుంచి పలు కీలక పదువులను భారత సంతతి వ్యక్తులు అధిరోహించడం జరిగింది. అటు యూఎస్‌లోని పలు రాష్ట్రాల రాజకీయాలలోనూ భారతీయ అమెరికన్లు చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 6న జరగనున్న చికాగో స్థానిక ఎన్నికల్లో ఏకంగా 10 మంది భారతీయులు బరిలో ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళ అభ్యర్థులు ఉండడం విశేషం. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో మాజీ కాంగ్రెస్ అభ్యర్థి సహా టాప్ డాక్టర్ ఉండడం గమనార్హం. ఈ ఎన్నికల బరిలో ఉన్న భారతీయ అమెరికన్ అభ్యర్థులు... జితేంద్ర దిగ్వాంకర్, డా. సురేష్ రెడ్డి(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ మాజీ అధ్యక్షుడు), నిమిషా జానీ, సయ్యద్ హుస్సేని, స్మితేష్ షా, వాసవి చక్కా, శ్వేత బైర్, సుప్నా జైన్, సబా హైదర్, మేఘన బన్సాల్ ఉన్నారు.   

Updated Date - 2021-04-02T17:32:15+05:30 IST