Peru దేశంలో లోయలో పడిన బస్సు...20 మంది మృతి

ABN , First Publish Date - 2022-02-11T13:08:41+05:30 IST

పెరూ దేశంలో తాజాగా జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20మంది దుర్మరణం చెందారు....

Peru దేశంలో లోయలో పడిన బస్సు...20 మంది మృతి

మరో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

లిమా: పెరూ దేశంలో తాజాగా జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20మంది దుర్మరణం చెందారు. ఉత్తర పెరూలో ప్రయాణికుల బస్సు రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో నాలుగేళ్ల బాలికతో సహా 20 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాదంలో మరో 30 మంది గాయపడ్డారని పెరూ అధికారులు తెలిపారు.క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.రిమోట్ నార్త్ లిబర్టాడ్ ప్రాంతంలో బస్సు 100 మీటర్ల లోతైన లోయలో బోల్తా పడిందని పెరూ ప్రభుత్వ అధికారులు చెప్పారు.బస్సు తయాబాంబా నుంచి ట్రుజిల్లోకు ప్రయాణిస్తోండగా ఈ దుర్ఘటన జరిగింది.


 340-కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి రోడ్ల అధ్వాన్న స్థితి కారణంగా 14 గంటల సమయం పడింది. అధ్వాన్నమైన రోడ్లు, అధిక వేగం,ప్రమాద సూచికలు లేకపోవడం, అధికారులు నిబంధనలను అమలు చేయక పోవడం వల్ల పెరూలో తరచుగా ట్రాఫిక్ ప్రమాదాలు జరుగుతున్నాయి.నవంబర్ 10న ఉత్తర పెరువియన్ జంగిల్‌లో మినీబస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు  మరణించారు.


Updated Date - 2022-02-11T13:08:41+05:30 IST