పత్తిలోడు మాటున ఎర్రచందనం
ABN , First Publish Date - 2021-04-18T05:41:55+05:30 IST
పత్తిలోడు లారీలో అక్రమంగా ఎర్రచందనాన్ని గుట్టుగా తరలిస్తున్న వైనాన్ని పోలీసులు రట్టు చేశారు. నెల్లూరు నుంచి ఢిల్లీ వైపుతో వెళ్తున్న ఓ లారీలో పోలీసులు తనిఖీలు చేయగా ఎర్రచందనాన్ని గుర్తించారు.
రూ.51 లక్షల విలువైన 141 దుంగలు స్వాధీనం
పిడుగురాళ్ల, ఏప్రిల్ 17: పత్తిలోడు లారీలో అక్రమంగా ఎర్రచందనాన్ని గుట్టుగా తరలిస్తున్న వైనాన్ని పోలీసులు రట్టు చేశారు. నెల్లూరు నుంచి ఢిల్లీ వైపుతో వెళ్తున్న ఓ లారీలో పోలీసులు తనిఖీలు చేయగా ఎర్రచందనాన్ని గుర్తించారు. పిడుగురాళ్ల తహసీల్దారు కార్యాలయ సమీపంలో లారీని ఆపి తనిఖీలు చేయగా 141 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుబ్రమణ్యేశ్వరరెడ్డి, రజారాంపలని, ఆవుల వెంకయ్య, వడివేల్ రాజామూర్తి, అక్కల రమేష్, వేముల వెంకటేశ్వర్లను పట్టుకొని వారి నుంచి 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ ప్రభాకరరావు తెలిపారు. దుంగల విలువ రూ.51,32,500లుగా అటవీశాఖాధికారులు నిర్థారించారు. లారీని సీజ్చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.