19న పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-16T05:23:54+05:30 IST

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ నెల 19వ తేదీన జరిగే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌ల ప్రారంభోత్సవానికి విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

19న పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌లు ప్రారంభం
సీఎం పర్యటన ఏర్పాట్లని పరిశీలిస్తున్న కలెక్టర్‌

గుంటూరు, మే 15 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ నెల 19వ తేదీన జరిగే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌ల ప్రారంభోత్సవానికి విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన జిల్లా అధికారులతో కలిసి తాడేపల్లి వెళ్లి అక్కడ కార్యక్రమం జరిగే వేదికని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొత్తం 175 సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌లను సీఎం జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వాహనాలన్నీ ఒక క్రమపద్ధతిలో, నిర్ణీత మార్గంలో వెళ్లేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీన, పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వర్లు, డీటీసీ మీరాప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌, ఉద్యానశాఖ డీడీ సుజాత, డ్వామా పీడీ యుగంధర్‌కుమార్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-16T05:23:54+05:30 IST