చికాగోలో 'ఆటా' వారి బతుకమ్మ సంబరాలు అదరహో..

ABN , First Publish Date - 2021-10-16T18:58:46+05:30 IST

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) చికాగో టీం అక్టోబర్ 9వ తారీఖున చికాగోలోని అరోరా బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో నిర్వహించిన దసరా, బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

చికాగోలో 'ఆటా' వారి బతుకమ్మ సంబరాలు అదరహో..

చికాగో: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) చికాగో టీం అక్టోబర్ 9వ తారీఖున చికాగోలోని అరోరా బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో నిర్వహించిన దసరా, బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఇల్లినాయిస్ 11వ డిస్ట్రిక్ట్ కాంగ్రెసు మాన్ బిల్ ఫాస్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల మధ్యన జ్యోతి ప్రజ్వలన చేసి కాంగ్రెస్ సభ్యుడు బిల్ ఫాస్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికాలో ఇంజనీరింగ్, మెడికల్, వ్యాపార రoగాలలో తెలుగు వారు ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించారని బిల్ ఫాస్టర్ కొనియాడారు. అమెరికా సంతతికి చెందిన మిలియన్‌కు పైగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంతో తమ సంస్కృతి, పండుగలు జరుపుకోవడం స్లాఘనీయం అని కొనియాడారు.


సాంప్రదాయ దుస్తులలో ముస్తాబైన మహిళలు పిల్లలు బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. యాంకర్‌గా మధు వ్యవరించి ప్రేక్షకులని కండుపుబ్బా నవ్వించారు. సరితా నంద్యాల అండ్ టీం నిర్వహించిన కోలాటం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రుద్ర గర్జన అండ్ చికాగో చేతన గ్రూప్ వారు తమ వినూత్న డోలు వాయిద్యాలతో శ్రోతలను ఉర్రతలూగించారు. మేళ తాళాలతో నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ కెమెరాతో నిమ్మజనం కార్యక్రమాన్ని చిత్రీకరించారు. జమ్మి పూజ నిర్వహించి అందరికి ప్రసాదాలు అందించారు. స్పెషల్ రుచికరమైన వంటకాలు, తినుబండారాలు ఆహుతులని ఆహ్లాదింపచేశాయి.  


బోర్డు ఆఫ్ ట్రస్టీ డాక్టర్ మెహర్ మేడవరం, ఆటా ట్రెజరర్ & ట్రస్టీ సాయినాథ్ రెడ్డి బోయపల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ఆఫీస్ కోఆర్డినేటర్ మహీధర్ ముస్కుల తోడ్పాటును అందించారు. రీజినల్ కోఆర్డినేటర్స్ వెంకట్రామ్ రెడ్డి రావి, వెంకటేశ్వర రామిరెడ్డి, సుచిత్ర రెడ్డి అన్ని తామై నడిపించిన ఈ కార్యక్రమానికి చల్మా రెడ్డి బండారు, వెంకట్ థుడి, మహిపాల్ వంఛ, భాను స్వర్గం, నరసింహ చిత్తలూరి, లక్ష్మి బోయపల్లి, కరుణాకర్ దొడ్డం, అమరేంద్ర నెట్టం, రమణ అబ్బరాజు, సతీష్ యెల్లమిల్లి, విశ్వనాధ్ చిత్ర, హరి రైని, జగన్ బుక్కరాజు, భీమి రెడ్డి తోడ్పాటును అందించారు. ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల, ప్రెసిడెంట్-ఎలెక్ట్  మధు బొమ్మినేని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.





Updated Date - 2021-10-16T18:58:46+05:30 IST