'ఆటా' బోర్డు మీటింగ్ విజయవంతం

ABN , First Publish Date - 2021-05-11T19:31:45+05:30 IST

అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఈ నెల 8న(శనివారం) జరిగిన ఆటా బోర్డు మీటింగ్ విజయవంతమైంది.

'ఆటా' బోర్డు మీటింగ్ విజయవంతం

కాస్మోపాలిటన్, లాస్ వేగాస్: అమెరికాలోని లాస్ వేగాస్‌లో ఈ నెల 8న(శనివారం) జరిగిన ఆటా బోర్డు మీటింగ్ విజయవంతమైంది. ఈ బోర్డు సమావేశానికి అధ్యక్షలు భువనేశ్ బూజాల అధ్యక్షత వహించారు. ఉత్తరాధ్యక్షులు మధు బొమ్మినేని, కార్యదర్శి హరిప్రసాద్రెడ్డి లింగాల, కోశాధికారి సాయినాథ్ బొయపల్లి, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ ఆల, సంయుక్త కోశాధికారి విజయ్ కందూర్, పూర్వ అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి, కార్య నిర్వాహక సంచాలకులు రఘువీర్రెడ్డి, పాలకమండలి బృంద సభ్యుల ఆధ్వర్యంలో ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న రీజినల్ కోఆర్డినేటర్స్, స్టాండింగ్ కమిటీమెంబర్స్, పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ప్రార్ధన గీతంతో ప్రారంభించారు. అనంతరం కోవిడ్‌తో మృతి చెందిన వారి కోసం మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆటా సంస్థ 2021లో చేపట్టిన కార్యక్రమాలు, రియల్ఎస్టేట్ వెబినార్, టాక్స్ వెబినార్, యూఎస్ఏకు ప్రయాణ నిషేధంపై ఇమ్మిగ్రేషన్ వెబినార్, డ్రోన్ని సమీకరించటం ఎలా అనే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్, గణితం(స్టెమ్) రంగానికి సంబంధించిన వెబినార్, అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం, అమెరికా భారతి పత్రిక మొదటి త్రైమాసిక విడుదల, ఉగాది సాహిత్య సదస్సు, వివిధ నగారాల్లో జరిపిన కమ్యూనిటీ సర్వీస్/ ఫుడ్ డ్రైవ్ ఈవెంట్స్, రక్తదాన శిబిరాలు, వాక్సిన్ డ్రైవ్ గురించి క్లుప్తంగా వివరించారు.


అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న యోగ క్లాసెస్, ఎల్ఏ ఫిట్నెస్ భాగస్వామ్య కార్యక్రమాల గురించి వివరించారు. ప్రస్తుతం కోవిడ్‌తో ఇబ్బంది పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకి సహాయంగా ఆటా సంస్థ 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కోసం విరాళాలని సేకరించి అందించింది. ఈ కార్యక్రమ దాతలకి ఆటా నాయకత్వం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది. అమెరికాలో పుట్టి పెరుగుతున్న యువతీ యువకులకు సంబందించిన 'డాలర్స్ఫర్స్కాలర్స్'అనే స్కాలర్షిప్‌ ఫండ్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 'మైస్కూల్- మైరెస్పాన్సిబిలిటీ' అనే కార్యక్రమానికి నాంది పలుకుతూ, విరాళాలు ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మే నెలలో ప్రారంభిస్తున్న భగవద్గీత ఆధ్యాత్మిక తరగతులు, అలాగే క్లౌడ్‌టెక్నాలజీ గురించి వివరించారు.


ఆటాలో అత్యధికంగా కొత్త సభ్యులని చేర్చిన వారికి ‘రీజినల్ కోఆర్డినేటర్ ఆఫ్ ది మంత్’గా గుర్తిస్తూ సంస్థ అభినందించింది. అమెరికా మరియు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్నకోవిడ్ పరిస్థితికి సహాయంగా మరిన్ని సేవా కార్యక్రమాలను చేయటానికి సంస్థ సిద్ధమవుతోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉన్న వాల్టర్.ఈ.వాషింగ్టన్ కన్వెన్షన్సెంటర్లో, 2022 జూలై1 నుండి జూలై 3వరకు జరిగే 17వ ఆటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ కాన్ఫరెన్స్ నాయకత్వ బృంద సభ్యులు సుధీర్ బండారు(కన్వీనర్‌గా), కిరణ్ పోషమ్(కో-ఆర్డినేటర్‌గా), కెకె రెడ్డి(డైరెక్టర్‌గా), జయంత్ చల్లా (అడ్వైజరీ చైర్‌గా), సాయి సుధిని(కో-కన్వీనర్‌గా), రవి చల్లా (కో-ఆర్డినేటర్‌గా) సంస్థ నియమించింది. అధ్యక్షులు భువనేశ్ బూజాల ఈ సంవత్సరంలో విజయవంతంగా ఆటా కార్యక్రమాలన్ని జరిపిస్తూ ఉన్న రిజినల్ కో-ఆర్డినేటర్స్‌ను, అలాగే స్టాండింగ్ కమిటీస్ అందరిని అభినందించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకి ఎమర్జెన్సీ పరిస్థితులలో సేవలను అందిస్తున్న ఆటా సేవా-టీం కార్యవర్గాన్ని కొనియాడారు. ఆటా ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న మీడియా మిత్రులందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-05-11T19:31:45+05:30 IST