Washington DC: అట్టహాసంగా ప్రారంభమైన ATA ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-07-02T13:17:33+05:30 IST
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యారు.
తెలుగు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల హాజరు
(వాషింగ్టన్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దు కృష్ణ): అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యారు. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడా దిగ్గజాలూ హాజరయ్యారు. 3వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబైంది. 17వ ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి.. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, క్రాంతి కిరణ్, గ్యాదరి కిషోర్ తదితరులకు వాషింగ్టన్ డీసీ విమానాశ్రయంలో ఎన్ఆర్ఐ యాస నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. వీరితో పాటు సద్గురు జగ్గీ వాసుదేవ్, మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్దేవ్, క్రిస్గేల్, హీరో అడవి శేష్, నటి రకుల్ ప్రీత్ సింగ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ టీం.. గాయకులు శ్రీకృష్ణ, సునీత, మనీషా ఈరబత్తిని, మంగ్లీ.. గీత రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి తదితరులు వెళ్లారు.