వైభవంగా ప్రారంభమైన ATA వేడుకలు
ABN , First Publish Date - 2022-07-03T01:23:35+05:30 IST
అమెరికన్ తెలుగు అసోసియేషన్ 17వ మహాసభలు శుక్రవారం రాత్రి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో వైభవంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖులకు అవార్డుల ప్రదానం
వాషింగ్టన్ నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దు కృష్ణ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ 17వ మహాసభలు శుక్రవారం రాత్రి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో ఉత్సవాలను ప్రారంభించారు. అమెరికాలో భారత రాయబారి నందు ప్రారంభోపన్యాసం చేశారు. వివిధ రంగాలలో ప్రముఖులకు అవార్డులను అందజేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లికార్జున రావు, అమెరికాలో సాఫ్ట్వేర్ దిగ్గజం ఐకా రవి, సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చలసాని నాగ ప్రసాద్, ప్రముఖ కూచిపూడి కళాకారిణి లక్ష్మీ బాబు తదితరులకు అవార్డులను అందజేశారు.
ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్, రకుల్ ప్రీతిసింగ్ తమ ప్రసంగాలతో అలరించారు. తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారులు, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే .శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.