ఆటా నాదం పాటల పోటీలు..

ABN , First Publish Date - 2021-11-10T16:53:11+05:30 IST

అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఆటా నాదం” పేరిట ఆన్‌లైన్‌లో జూమ్ ద్వారా పాటల పోటీలను నిర్వహిస్తుంది.

ఆటా నాదం పాటల పోటీలు..

అమెరికా తెలుగు సంఘం (ఆటా)  “ఆటా నాదం” పేరిట ఆన్‌లైన్‌లో జూమ్ ద్వారా పాటల పోటీలను నిర్వహిస్తుంది. దాదాపు 200 మంది గాయని గాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తరాధ్యక్షులు, ఆటా సేవ డేస్ & ఆటా వేడుకల చైర్మన్  మధు బొమ్మినేని, పాలకమండలి సభ్యులు, సంయుక్త  కార్యదర్శి, ఆటానాదం కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి ఆల, పాలక మండలి సభ్యులు, సేవ డేస్ & ఆటా వేడుకల కోచైర్ అనిల్ బొద్దిరెడ్డి, పాలక మండలి సభ్యులు, సేవ డేస్ & ఆటా వేడుకల కోచైర్ శరత్ వేముల, పాలకమండలి సభ్యులు, ఆటా నాదం కోఆర్డినేటర్ శారద సింగిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిభ ఉన్న గాయనిగాయకుల కోసం మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 


ఆటా సంస్థ “ఆటా నాదం” పాటల పోటీలను అక్టోబర్ 23న ప్రిలిమినరీ రౌండ్‌తో ప్రారంభించి సెమి ఫైనల్స్ నవంబర్ 6న ముగించింది. ఈ కార్యక్రమాలకు సంగీత దర్శకులు, ప్లేబాక్ సింగర్  నిహాల్ కొందూరి, ప్లేబాక్ సింగర్, సినీ మ్యుజిషియన్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ లక్ష్మి,  సంగీత దర్శకులు, ప్లేబ్యాక్ సింగర్ సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి పదకొండు మంది గాయని గాయకులు అభినవ్ అవసరాల, గీత మహతి పిసుపాటి, జ్యోస్న నిమ్మలపాడి, లక్ష్మి శ్రీవల్లి కాందూరి, లేఖ సదా ఫణిశ్రీ వీర, మేఘన నాయుడు దాసరి, నిగమ నెల్లుట్ల, ప్రణతి కే, సాయి శృతి పొలిశెట్టి, సాకేత్ కొమ్మజోస్యుల, వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల ఫైనల్ రౌండ్‌కు ఎంపికయ్యారు. ఈ గాయని గాయకులు మ్యూజిక్ డైరెక్టర్ కోటితో పాటు పైన పేర్కొన్న నలుగురు న్యాయ నిర్ణేతల సమక్షంలో నవంబర్ 13న జరిగే ఫైనల్స్‌లో పోటీపడతారు.


ఆటా ఉత్తరాధ్యక్షులు ఆటా సేవ డేస్ & ఆటా వేడుకల చైర్ మధు బొమ్మినేని  డిసెంబర్ 5, 2021 నుండి డిసెంబర్ 25, 2021 వరకు అధ్యక్షులు భువనేశ్ బూజల, పాలక మండలి సభ్యులు, ఆటా కార్యవర్గ బృందంతో కలిసి విద్య, వైద్య, కమ్యూనిటీ సేవలు, స్త్రీ సంక్షేమం, బిజినెస్ సెమినార్స్, ఎడ్యుకేషనల్ సెమినార్స్ లాంటి వివిధ కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ నగరాలలో, గ్రామాలలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు మాతృదేశం కళాకారులతో వివిధ నగరాలలో నిర్వహించనున్నారు. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఆటా మహాసభలు జరుగబోయే ముందు ప్రథమంగా తెలుగు రాష్ట్రాలలో సేవ కార్యక్రమాలు చేయడం సంస్థ క్రమం తప్పకుండా బాధ్యతగా నిర్వహిస్తోంది. ఆటా వేడుకల కార్యక్రమములో భాగంగా ప్రతిభవంతులైన యువ గాయనీ గాయకులకు ఆటాలో ప్రత్యేకమైన వేదికను కలిపించాలని సదుద్దేశముతో 'ఆటా నాదం' పాటల పోటీల కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. విజేతలకు డిసెంబర్ 26, 2021సాయంత్రం 7 గంటలకు రవీంద్రభారతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమం “ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే”లో   పాడడానికి ఆటా సంస్థ గొప్ప అవకాశం కలిపిస్తుంది. 



Updated Date - 2021-11-10T16:53:11+05:30 IST