SKL: సిగ్గు, ఎగ్గూ లేకుండా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు: Atchannaidu

ABN , First Publish Date - 2022-07-08T17:54:35+05:30 IST

సిగ్గు, ఎగ్గూ లేకుండా రైతు దినోత్సవంనిర్వహిస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు.

SKL: సిగ్గు, ఎగ్గూ లేకుండా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు: Atchannaidu

శ్రీకాకుళం (Srikakulam): రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తోందని, సిగ్గు, ఎగ్గూ లేకుండా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారని టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతు దినోత్సవం కంటే రైతు దగా దినోత్సవంగా మార్చుకుంటే మంచిదన్నారు. తితిలీ తుఫాన్‌లో నాలుగు మండలాలు విధ్వంసం అయ్యాయని, అప్పట్లో చంద్రబాబు బాధితులకు యుద్ధ ప్రాతిపదికన పరిహారం అందించారన్నారు. ఆ రోజు జగన్ (Jagan) ప్రక్క జిల్లాలో క్యాట్ వాక్ చేశారు తప్పా పాలకరించలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన వెంటనే తితిలీ బాధితులకు పరిహారం డబుల్ ఇస్తామన్నారు... పరిహారం వైసీపీకి చెందిన వారికే ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ ఫేక్ ముఖ్యమంత్రి అని, టీడీపీ (TDP) సానుభూతి పరులను జాబితా నుంచి తప్పిస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లి పరిహారం ఇప్పిస్తామన్నారు. రైతు దినోత్సవం ఏమి చేశారని నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. రైతులను దగా చేసినందుకు ఉత్సవాలా? జిల్లాలో ఎక్కడా విత్తనాలు, ఎరువులు దొరకటం లేదు. ప్రభుత్వ తీరుపై విసుగు చెంది రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని అన్నారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని కేంద్రమే చెబుతోందన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు... రైతు అమ్ముకున్న పంటకు డబ్బు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2022-07-08T17:54:35+05:30 IST