ఆ దోపిడీ అంతా జగన్ ప్యాలెస్‌కి వెళ్తుంది: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-07-27T19:16:23+05:30 IST

ఆ దోపిడీ అంతా జగన్ ప్యాలెస్‌కి వెళ్తుంది: అచ్చెన్నాయుడు

ఆ దోపిడీ అంతా జగన్ ప్యాలెస్‌కి వెళ్తుంది: అచ్చెన్నాయుడు

విజయనగరం: ఐఏఎస్, ఐపీ‌ఎస్‌లు దగ్గరుండి తన ఇంటి కాంపౌండ్ వాల్ కొట్టించారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా గోడ కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో టీడీపీ ప్రధాన నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన  ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. దొంగోడు చెప్తే పోలీసులు నీతిగా మమ్మల్ని దొంగలను చేస్తున్నారని పేర్కొన్నారు. ‘సజ్జల కున్న నాలెడ్జ్ ఏంటి, సజ్జలకు ఏమి తెలుసు?, సజ్జల కూడా ఒక సలహదారుడా?. క్యాబినెట్ వ్యవహారాలు కూడా సజ్జల చెప్పటం ఏంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. సజ్జల మంత్రులను కూడా ప్రక్కన పెట్టేశాడని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. రాష్ట్రంలో దోపిడీ జరుగుతుందన్నారు. మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. యాచకుల దగ్గర కూడా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. మద్యం షాపుల్లో జరిగే దోపిడీ జగన్ ప్యాలెస్‌కి వెళ్తుందన్నారు.  


Updated Date - 2022-07-27T19:16:23+05:30 IST