ఎవరెన్ని చట్టాలు చేసినా అమరావతి ఒక్కటే రాజధాని: అచ్చెన్న
ABN , First Publish Date - 2021-12-10T19:16:55+05:30 IST
ఎవరెన్ని చట్టాలు చేసినా అమరావతి ఒక్కటే రాజధాని అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అమరావతి : ఎవరెన్ని చట్టాలు చేసినా అమరావతి ఒక్కటే రాజధాని అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అమరావతి కోసం మహిళలు తిరుగు లేని పోరాటం చేస్తున్నారన్నారు. పాదయాత్ర రైతులు బస చెయ్యకుండా ఆ ప్రాంతాన్ని ట్రాక్టర్లతో దున్నిస్తారా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో ఉన్న మహిళల టాయిలెట్లు తొలగిస్తారా? అంటూ మండిపడ్డారు. ఇంత దారుణం ఎక్కడా ఉండదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.