కశ్మీర్ డాక్టరుతో ఐఎఎస్ అధికారి అధర్‌ఖాన్ నిశ్చితార్థం

ABN , First Publish Date - 2022-07-04T18:24:33+05:30 IST

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) అధికారి అథర్ అమీర్ ఖాన్ తాజాగా కశ్మీరుకు చెందిన డాక్టర్ మెహ్రీన్ ఖాజీని వివాహమాడనున్నారు....

కశ్మీర్ డాక్టరుతో ఐఎఎస్ అధికారి అధర్‌ఖాన్ నిశ్చితార్థం

శ్రీనగర్(జమ్మూ్కశ్మీర్): ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) అధికారి అథర్ అమీర్ ఖాన్ తాజాగా కశ్మీరుకు చెందిన డాక్టర్ మెహ్రీన్ ఖాజీని వివాహమాడనున్నారు.అథర్ ఖాన్, డాక్టర్ మెహ్రీన్‌ల నిశ్చితార్థం తాజాగా శ్రీనగర్‌లో జరిగింది.అథర్‌ఖాన్ ఆదివారం తన ఇన్ స్టాగ్రాంలో (Instagram)తన నిశ్చితార్థాన్ని ప్రకటించారు. డాక్టర్ ఖాజీతో తన నిశ్చితార్థం ఫొటోను ఖాన్ పోస్ట్ చేశారు.డాక్టర్ ఖాజీ కూడా తన ఎంగేజ్‌మెంట్ ఫొటోను కూడా షేర్ చేశారు.డాక్టర్ ఖాజీ శ్రీనగర్‌లో నివసిస్తున్నారు. శ్రీనగర్ లో ఖాన్ మునిసిపల్ కమీషనర్‌గా నియమితులయ్యారు. మెడిసిన్‌లో ఎండీ చదివిన డాక్టర్ ఖాజీ ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లే ముందు ఢిల్లీలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో చదివారు. 


2015లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలో టీనా దాబీ అగ్రస్థానంలో నిలిచారు. అదే సంవత్సరం అథర్ ఖాన్ రెండవ స్థానంలో నిలిచారు. వారిద్దరూ  2018 ఏప్రిల్‌లో ఢిల్లీలో వివాహం చేసుకున్నారు.అనంతరం వీరిద్దరూ జైపూర్‌లోని కుటుంబ న్యాయస్థానంలో విడాకులు తీసుకున్నారు. దీంతో టీనా దబీ జైపూర్‌లో ఐఎఎస్ అధికారి డాక్టర్ ప్రదీప్ గవాండేని వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ కేడరుకు చెందిన ఖాన్ ఇప్పుడు జమ్మూ,కశ్మీర్ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు.

Updated Date - 2022-07-04T18:24:33+05:30 IST