ఏటీఎం దొంగ అరెస్టు
ABN , First Publish Date - 2021-01-24T04:46:50+05:30 IST
ఏటీఎంల్లో చోరీలకు యత్నిస్తున్న దొంగను నవాబుపేట పోలీసులు శనివారం నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద అరెస్టు చేశారు.
నెల్లూరు(క్రైం) జనవరి 23: ఏటీఎంల్లో చోరీలకు యత్నిస్తున్న దొంగను నవాబుపేట పోలీసులు శనివారం నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద అరెస్టు చేశారు. నెల్లూరు నవాబుపేట పోలీసు స్టేషన్లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో సీఐ వేమారెడ్డి నిందితుడి వివరాలను తెలిపారు. వెంకటేశ్వరపురం నేతాజీ నగర్కు చెందిన షేక్ షరీఫ్ అలియాస్ బేబి పెయింట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో చెడువ్యసనాలకు బానిసయ్యాడు. ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడం ప్రారంభించాడు. అందులో బాగంగా గురువారం అర్ధరాత్రి వెంకటేశ్వరపురంలోని కెనెరాబ్యాంకు, రేబాలవీధిలోని స్టేటు బ్యాంకు ఏటిఎంల్లో దొంగతనానికి యత్నించాడు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు వెళ్లే సరికి పరారైన నిందితుడి కోసం గాలించి రైల్వేస్టేషన్ వద్ద అరెస్టు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సిబ్బంది తురకా శ్రీనివాసులు, సురేంద్రబాబు, మోహన్బాబు, లాలా అహ్మద్, మస్తానయ్యలను సీఐ అబినంధించారు. సమావేశంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.