టీడీపీతోనే మైనార్టీల అభివృద్ధి
ABN , First Publish Date - 2021-03-08T06:54:50+05:30 IST
అన్ని వర్గాలకు చల్లని నీడనిచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని, టీడీపీతోనే మైనార్టీల అభివృద్ధి జరుగుతుందని హిం దూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హిందూపురం, మార్చి7: అన్ని వర్గాలకు చల్లని నీడనిచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని, టీడీపీతోనే మైనార్టీల అభివృద్ధి జరుగుతుందని హిం దూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం హిందూపురంలోని సడ్లపల్లి, హౌసింగ్బోర్డుకాలనీ, పోచనపల్లి, రహమత్పురం, మోతకపల్లిలో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భం గా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశం ఇచ్చి, గుర్తింపుతోపాటు సంక్షేమ పథకాలు అఽందించిన ఘనత టీడీపీదేనన్నారు. హైదరాబాద్లో రాళ్లగుట్టలను హైటెక్సీటీగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మైనార్టీ వర్గాలకు సంక్షేమ కోసం ఎన్నో పథకాలు టీడీపీ పాలనలో తెచ్చామన్నారు. జిల్లాలో సాగు, తాగునీటితోపాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందాయంటే అందుకు టీడీపీ కృషే కారణమన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాతే హిందూపురం అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. ఒక్క సారి అంటూ అధికారం చేపట్టిన వైసీపీ రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ నీచమైన పాలనను వైసీపీ సాగిస్తోందని విమర్శించారు. హిందూపురంలో విద్యా, వైద్యం, పారిశ్రామిక రంగాలకు పెద్ద పీట వేశామన్నారు. టీడీపీ అభ్యర్థులను గెలించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయన వెంట అహుడా మాజీ చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ, మున్సిపల్ టీడీపీ ఎన్నికల పరిశీలకులు సవితమ్మ, నరసింహులు, మనోహర్నాయు డు, టీడీపీ చైర్మన్ అభ్యర్థి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.