కొత్తగా 550 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-06-13T06:47:35+05:30 IST
జిల్లాలో శనివారం కొత్తగా 550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మరో ఐదుగురు మృతి
అనంతపురం వైద్యం, జూన్ 12: జిల్లాలో శనివారం కొత్తగా 550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు వైరస్కు బలయ్యారు. ఈ లెక్కన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తంగా 149277 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 145752 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 998 మంది మృతిచెందారు. ప్రస్తుతం 2477 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కరోజులో 8183 శాంపిళ్లు పరీక్ష చేయగా.. 6.72 శాతం కరోనా పాజిటివిటీ నమోదైంది. దీనిని బట్టి చూస్తే జిల్లాలో వైరస్ ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.