కొత్తగా 326 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-20T06:49:48+05:30 IST

జిల్లాలో శనివారం 326 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కొత్తగా 326 కరోనా కేసులు

- మరో ముగ్గురు మృతి

అనంతపురం వైద్యం, జూన్‌ 19: జిల్లాలో శనివారం 326 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6173 శాంపిల్స్‌ పరీక్షించగా.. 5.28 శాతం పాజిటివిటీ రే టు నమోదైంది. వైర్‌సతో మరో ముగ్గురు మృతిచెందారు. దీంతో జిల్లాలో ఇ ప్పటి వరకు మొత్తం 151647 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 149266 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1024 మంది మరణించారు. ప్రస్తు తం 1357 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-06-20T06:49:48+05:30 IST