వార్షిక మల్బరీ సాగు లక్ష్యం 3750 ఎకరాలు: జేడీ

ABN , First Publish Date - 2021-07-25T06:11:48+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఈఏడాది 3750 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ పేర్కొన్నారు.

వార్షిక మల్బరీ సాగు లక్ష్యం 3750 ఎకరాలు: జేడీ

అనంతపురం అర్బన్‌, జూలై 24: జిల్లావ్యాప్తంగా ఈఏడాది 3750 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మమ్మ పేర్కొన్నారు. శనివారం ఆమె ఈ ఏడాది మల్బరీ సాగు నిర్దేశిత లక్ష్యాలు-సాధించాల్సిన పురోగతిపై అధికారులతో సమీక్షించారు. సాగు లక్ష్య సాధనలో దాదాపు 250 లక్షల మొక్కలు నాటేందుకు సన్నహాలు చేశామన్నా రు. రైతులు అధికారుల సూచనలు పాటిస్తూ.. సరైన క్రమంలో పంటను సా గుచేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీ నాగేశం, ఎస్‌ఓ రామకృష్ణ, ఏఎ్‌సఓలు జయచంద్రారెడ్డి, ఫిరోజ్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:11:48+05:30 IST