కార్యకర్తలు, అభిమానుల నడుమ..

ABN , First Publish Date - 2020-10-27T10:17:03+05:30 IST

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కార్యకర్తలు, అభిమానుల నడుమ..

 కాలవ జన్మదిన వేడుకలు..

రాయదుర్గం, అక్టోబరు 26: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి, ఆయనకు పుష్పగుచ్ఛాలిచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు కడ్డిపూడి మహబూబ్‌ బాషా, ఖలందర్‌, ఇనాయత్‌, జమీల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాల కన్వీనర్లు లాలెప్ప, బలరామిరెడ్డి, నాయకులు కాలవ సన్నణ్ణ, రాఘవరెడ్డి, గిరిమల్లప్ప, పాలయ్య, దానవేంద్ర, నాగరాజు, గంగాధర, రంగస్వామి, మోహన్‌రంగ, కల్యం తిప్పేస్వామి, కాదలూరు మోహన్‌ రెడ్డి, గంగాధర, మాజీ జడ్పీటీసీ మల్లికార్జున, కొత్తపల్లి మల్లికార్జున, ధనుంజయ, పయ్యావుల మోహన్‌, కేశవరెడ్డి, కొత్తపల్లి మహేంద్ర, కేశప్ప, ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు. 


గుమ్మఘట్ట: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వందలాది మంది తరలివెళ్లి కాలవ శ్రీనివాసులు జన్మదిన వేడుకల్లో పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యం గుండ్లపల్లి, తాళ్లకెర, కలుగోడు, గుమ్మఘట్ట, గలగల, భూపసముద్రం తదితర గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి కాలవ సన్నణ్ణ, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, గిరిమల్లప్ప, దానవేంద్ర, పాలయ్య, రంగస్వామి, గంగాధర, మోహన్‌ రంగ, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T10:17:03+05:30 IST