రాష్ట్రంలో ధృతరాష్ట్రుడి పాలన

ABN , First Publish Date - 2020-10-29T09:56:49+05:30 IST

రాష్ట్రంలో ప్రస్తుతం కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడి పాలన సాగుతోందని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ముషీరాబేగం ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ధృతరాష్ట్రుడి పాలన

కొండెక్కిన నిత్యావసర సరకుల ధరలు: తెలుగు మహిళల ఆగ్రహం



అనంతపురం వైద్యం అక్టోబరు28: రాష్ట్రంలో ప్రస్తుతం కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడి పాలన సాగుతోందని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ముషీరాబేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు  విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. 


ధరలు మూడింతలు పెరిగిపోవడంతో కడుపునిండా అన్నం తినలేని పరిస్థితిలో ప్రజలు ఉండిపోయారన్నారు. చివరకు ఉప్పు, పప్పు కొనలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రజల కోసం టీడీపీ పోరాడుతుంటే పరిష్కరించాల్సిన అధికార పాలకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి ప్రియాంక, నగర అధ్యక్షురాలు విజయశ్రీ, తెలుగు మహిళలు స్వప్న, కంటాదేవి, జానకి, సరోజమ్మ, హసీనా, వడ్డేవాణి, వసుందర, కృష్ణవేణి, శంకరమ్మ, మహేశ్వరి, ఫక్రున్ని పాల్గొన్నారు.

Updated Date - 2020-10-29T09:56:49+05:30 IST