రాజధాని రైతులకు సంకెళ్లా?
ABN , First Publish Date - 2020-10-29T10:00:15+05:30 IST
అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన దళిత రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు.
టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు
శింగనమల, అక్టోబరు 28: అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన దళిత రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అమరావతి వెలగపూడిలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దీక్ష చేపడుతున్న రైతులకు ఆయన సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు, దళిత రై తులకు రక్షణ కరువైందన్నారు. దళిత రైతులకు సంకెళ్లు వేయడంపై మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.