అర్హులందరికీ సంక్షేమ పథకాలు : మంత్రి
ABN , First Publish Date - 2020-10-30T09:14:50+05:30 IST
పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సం క్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు.
పెనుకొండ రూరల్, అక్టోబరు 29 : పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సం క్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మునిమడుగు గ్రామం లో ఎంపీడీఓ శివశంకరప్ప అధ్యక్షతన జరిగిన రచ్చబండ, పల్లెబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే పథకాలు అందేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికే మీ గ్రామానికి వచ్చామన్నారు. అనంతరం సిం గిల్విండో అధ్యక్షుడు శ్రీనివాసులు గుట్టూరు నుంచి మరువకుంటపల్లి, అమ్మవారిపల్లి నుంచి మోటువారిపల్లి వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నిషాంతి, తహసీల్దార్ నాగరాజు, ఏఓ రాకేష్ నా యక్, ఏపీఎం రవిచంద్రరాజు, హౌసింగ్ జేఈ శ్రీనాథ్, ఏపీఓ రాజశేఖర్, మండల కన్వీనర్ శ్రీకాంత్రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీరాములు, నాగలూరుబాబు, వేములేటి ప్రసాద్రెడ్డి, డీలర్ సత్యనారాయణ, రెడ్డప్ప, వెంకటరాముడు, శ్యామ్నాయక్ పాల్గొన్నారు.