267 నామినేషన్ల ఉపసంహరణ
ABN , First Publish Date - 2021-03-03T07:26:38+05:30 IST
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తొలిరోజైన మంగళవారం జిల్లా వ్యాప్తంగా 267 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
అనంతపురం కార్పొరేషన్, మార్చి 2: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తొలిరోజైన మంగళవారం జిల్లా వ్యాప్తంగా 267 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అనంతపురం కార్పొరేషన్లో 25 మంది విత్ డ్రా చేసుకున్నారు. గతేడాది మార్చిలో నామినేషన్ల పరిశీలన తరువాత ఎన్నికలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియను కొనసాగిస్తూ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మేరకు మంగళ, బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. హిందూపురం మున్సిపాలిటీలో 26, గుంతకల్లులో 40, తాడిపత్రిలో 49, ధర్మవరంలో 28, కదిరిలో 15, రాయదుర్గంలో 34, గుత్తిలో 18, కళ్యాణదుర్గంలో 8, పుట్టపర్తి నగ ర పంచాయతీలో 10, మడకశిర నగర పంచాయతీలో 14 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పార్టీల పరంగా వైసీపీ నుంచి 146, టీడీపీ 68, జనసేన 5, బీజేపీ 8, సీపీఎం 1, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థులు 36 మంది నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. సీపీఐ నుంచి ఒక్క నామినేషన్ కూడా ఉపసంహరించుకోలేదు.