ఎస్కేయూ స్నాతకోత్సవం వాయిదా
ABN , First Publish Date - 2021-03-03T07:20:31+05:30 IST
ఎస్కేయూ 19వ స్నాతకోత్సవం ఏప్రిల్కు వాయిదా వేసినట్లు వీసీ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు.
అనంతపురం, మార్చి2: ఎస్కేయూ 19వ స్నాతకోత్సవం ఏప్రిల్కు వాయిదా వేసినట్లు వీసీ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. మార్చి 5న స్నాతకోత్సవం నిర్వహించాలని ఇదివరకు తేదీలు ఖరారు చేసినా.. గౌరవ డాక్టరేట్ అందుకోనున్న డీఆర్డీఓ చైర్మన్ సతీ్షరెడ్డి మార్చి 5నే ప్రధాన మంత్రిని కలవాల్సి ఉండటంతో స్నాతకోత్సవాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి స్నాతకోత్సవ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.