TS News: దారుణం.. ఒక చోట హత్య.. మరో చోట ప్రేమికుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-18T02:36:40+05:30 IST

సూర్యాపేట / నాగర్ కర్నూలు జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఘటనలు జరిగాయి. మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను సజీవదహనం చేసిన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. హుజూర్నగర్ మండలం మర్రిగూడెనికి చెందిన గొట్టుముక్కల

TS News: దారుణం.. ఒక చోట హత్య.. మరో చోట ప్రేమికుల ఆత్మహత్య

సూర్యాపేట / నాగర్ కర్నూలు జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఘటనలు జరిగాయి. మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను సజీవదహనం చేసిన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. హుజూర్నగర్ మండలం మర్రిగూడెనికి చెందిన గొట్టుముక్కల వెంకటమ్మ, గోపయ్య భార్యభర్తలు. గోపయ్య మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం తరుచూ భార్యతో గొడవపడేవాడు. ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించేది. ఈ క్రమంలో మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంలో ఆమెను చంపేయాలనుకున్నాడు. గది తలుపులు వేసి కిటికీలోంచి మంచంపై నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో వెంకటమ్మ సజీవ దహనమైంది. కొడుకు ఫిర్యాదు చేయడంతో  పోలీసులు కేసు నమోదు చేసుకుని గోపయ్యను అదుపులోకి తీసుకున్నారు. 


నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తుమ్మలసుగుర్ గ్రామానికి చెందిన గౌస్ (25) గౌసియా (21) ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పంట పొలంలో గౌస్ ఉరేసుకుని ఆత్మచేసుకోగా.. గౌసియా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలొదిలింది.  

Updated Date - 2022-09-18T02:36:40+05:30 IST