అలా జరగడానికి ఆడపడుచే కారణం అనుకుంది.. కళ్లకు గంతలు కట్టి.. చివరకు ఏం చేసిందో తెలుసా..

ABN , First Publish Date - 2021-10-06T03:31:43+05:30 IST

ఒక్కోసారి చిన్నచిన్న గొడవలు.. పెద్దవి అవుతుంటాయి. చివరకు ఘోరాలకు పాల్పడే వరకూ వెళ్తుంటాయి. భార్యాభర్తలన్నాక గొడవలు జరుగుతుంటాయి. మధ్యప్రదేశ్‌లో కూడా ఓ జంట రోజూ గొడవ పడేది. అయితే ఈ గొడవలకు ఆడపడుచే కారణమని

అలా జరగడానికి ఆడపడుచే కారణం అనుకుంది.. కళ్లకు గంతలు కట్టి.. చివరకు ఏం చేసిందో తెలుసా..

ఒక్కోసారి చిన్నచిన్న గొడవలు.. పెద్దవి అవుతుంటాయి. చివరకు ఘోరాలకు పాల్పడే వరకూ వెళ్తుంటాయి. భార్యాభర్తలన్నాక గొడవలు జరుగుతుంటాయి. మధ్యప్రదేశ్‌లో కూడా ఓ జంట రోజూ గొడవ పడేది. అయితే ఈ గొడవలకు ఆడపడుచే కారణమని ఓ మహిళ అనుమానం పెంచుకుంది. పైకి ప్రేమ నటిస్తూ ఆడుకుందామని ఆడపడుచుని పిలిచింది. తర్వాత కళ్లకు గంతలు కట్టి ఎంత పని చేసిందో తెలుసా.. వివరాల్లోకి వెళ్తే..


మధ్యప్రదేశ్‎లోని మందసౌర్‌లోని వ్యాస్ కాలనీకి చెందిన సురేష్ శ్రోత్రియ్ అనే వ్యక్తికి,  ఛత్తీస్‌ఘడ్‌లోని అంబికాపూర్‌కు చెందిన రష్మికకు సోషల్ మీడియాలో పరిచయమైంది. రానురాను ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. రిచయం కాస్త ప్రేమగా మారింది. వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం భర్త, అత్తమామ, ఆడపడుచుతో ఉంటున్నారు. అయితే ఉన్నట్టుండి సురేష్ చెల్లెలు హర్షిత శ్రోత్రియ్ హత్యకు గురైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో సంచలన విషయం వెలుగుచూసింది.


చిన్న చిన్న కారణాలకు సురేష్ చెల్లెలు హర్షిత శ్రోత్రియ్‎తో.. రష్మి గొడవ పడుతుండేది. ఈ విషయాలన్ని హర్షిత శ్రోత్రియ్ అన్నయ్య సురేష్‎కు చెబుతుండేది. ఈ కారణంగా రష్మి, సురేష్ మధ్య గొడవలు జరుగుతుందేవి. దీంతో ఆడపడుచు హర్షితపై రష్మి పగ పెంచుకుంది. ఓ రోజు కళ్లకు గంతలు ఆట ఆడదామని హర్షితను పిలిచిన రష్మి.. ఆమె కళ్లకు గంతలు కట్టింది. తర్వాత కత్తితో హర్షితపై దాడిచేసి.. ఇంటికి సమీపంలోని బావిలోకి తోసేసింది. అక్టోబరు 2న హర్షిత మృతదేహం కనిపించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా విషయం బయటపడింది.

Updated Date - 2021-10-06T03:31:43+05:30 IST