Ludhianaలో దారుణం...ఆన్‌లైన్ స్నేహితురాలిని హోటల్‌కు తీసుకువెళ్లి అత్యాచారం

ABN , First Publish Date - 2022-06-08T13:04:16+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నగరంలో మరో దారుణం వెలుగుచూసింది....

Ludhianaలో దారుణం...ఆన్‌లైన్ స్నేహితురాలిని హోటల్‌కు తీసుకువెళ్లి అత్యాచారం

లూథియానా: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. ఆన్‌లైన్‌లో పరిచయమైన 21 ఏళ్ల స్నేహితురాలిని హోటల్‌కు తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన యువకుడి బాగోతం లూథియానా నగరంలో వెలుగుచూసింది. సంగ్రూర్‌లోని బెర్ కలాన్ గ్రామానికి చెందిన అర్ష్‌దీప్ మాన్ అనే నిందితుడు మల్టీమీడియా ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లో బాధితురాలితో స్నేహం చేశాడు.యువకుడు తన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాననే నెపంతో 21 ఏళ్ల తన ఆన్‌లైన్ స్నేహితురాలిని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.‘‘జూన్ 6వతేదీన నిందితుడు నన్ను అతని సోదరి, బావమరిదికి పరిచయం చేయడానికి పఖోవాల్ రోడ్డులోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సంఘటన గురించి ఎవరికీ చెప్పవద్దని అతను నన్ను హెచ్చరించాడు’’ అని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.


తాను ఫిర్యాదుదారుని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని, అందువల్ల ఆమెను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేయాలనుకుంటున్నట్లు నిందితుడు పేర్కొన్నాడని కేసు దర్యాప్తు చేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ రాజన్‌దీప్ సింగ్ చెప్పారు. నిందితుడిపై సదర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-06-08T13:04:16+05:30 IST