నిజామాబాద్ జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2022-04-29T00:27:43+05:30 IST

జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. తనకు నచ్చడం

నిజామాబాద్ జిల్లాలో దారుణం

నిజామాబాద్: జిల్లాలోని వర్ని మండలంలో రాజ్‌పేట్ తండాలో దారుణ సంఘటన జరిగింది. తనకు నచ్చడం లేదని మూడు నెలల గర్భిణి అయిన తన భార్య కల్యాణి ( 24 ) నోట్లో యాసిడ్ పోసి భర్త తరుణ్ దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు మామ సక్రియా, మరిది ప్రవీణ్‌లు సహకరించారు. అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు నచ్చలేదన్న సాకుతో ఈ అఘాయిత్యానికి భర్త పాల్పడ్డాడు. మహిళను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

Updated Date - 2022-04-29T00:27:43+05:30 IST