పులివెందుల నియోజకవర్గంలో దారుణం

ABN , First Publish Date - 2022-04-28T23:52:31+05:30 IST

సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల నియోజకవర్గంలో

పులివెందుల నియోజకవర్గంలో దారుణం

కడప: సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందుల నియోజకవర్గంలో దారుణం జరిగింది. టీడీపీ శ్రేణులను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసి పోలీసుల ద్వారా వేధింపులకు గురి చేపిస్తున్నారు. ఈ వేధింపులను భరించలేక చక్రాయపేట మండలం చెరువు కాంపల్లెలో టీడీపీకి చెందిన కుటుంబం గుంటి రామంజనేయులు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించారని రామాంజనేయులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించారు. గతంలో కూడా రామంజనేయులుపై వైసీపీ శ్రేణులు అక్రమ కేసులు పెట్టించాయి. మరోసారి పోలీసులు తన ఇంటికి రావడంతో అవమానంతో రామాంజనేయులు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం వారిని కడప రిమ్స్‌కు తరలించారు. 

Updated Date - 2022-04-28T23:52:31+05:30 IST