
సిద్దిపేట: జిల్లాలోని తొగుట మండలంలోని వెంకట్రావ్పేటలో దారుణ ఘటన జరిగింది. ఏడాది వయసున్న కుతురిని కరెంట్ షాక్తో తండ్రి రాజశేఖర్ చంపాడు. అనంతరం పురుగుల మందు తాగి రాజశేఖర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం రాజశేఖర్ను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు. దంపతులు రాజశేఖర్, సునీత మధ్య ఘర్షణ జరిగిందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.