మహిళపై దాడి చేసి నగలు దోపిడీ

ABN , First Publish Date - 2020-12-04T04:50:03+05:30 IST

మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసి నగలు దోచుకెళ్లాడు. ఈ సంఘటన మండలంలోని చెల్దిగానిపల్లెలో జరిగింది.

మహిళపై దాడి చేసి నగలు దోపిడీ
చికిత్స పొందుతున్న రుక్మిణమ్మ

రామకుప్పం, డిసెంబరు 3: మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసి నగలు దోచుకెళ్లాడు. ఈ సంఘటన మండలంలోని చెల్దిగానిపల్లెలో జరిగింది. స్థానికుల, పోలీసుల కథనం మేరకు.. చెల్దిగానిపల్లెకు చెందిన కృష్ణప్ప భార్య రుక్మిణమ్మ(45) గురువారం ఉదయం గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లింది. అక్కడ పొలం పని చేసుకుంటూ ఉండగా గుర్తుతెలియని వ్యక్తి బండరాయితో దాడికి పాల్పడ్డాడు. రక్తగాయాలకు గురైన ఆమె సృహ కోల్పోయింది. దుండగుడు ఆమె ఒంటిపై గల బంగారు తాళి ఉన్న గొలుసు, కమ్మలు, ముక్కుపుడకలు లాక్కుని పరారయ్యాడు. తల, చెవుల వద్ద తీవ్రగాయాలకు గురై రుక్మిణమ్మ అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన బంధువులు ఆమెను కుప్పం ఆస్పత్రికి తరలించారు. కుప్పం గ్రామీణ సీఐ యతీంద్ర, రామకుప్పం ఎస్‌ఐ కృష్ణయ్య సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-04T04:50:03+05:30 IST