పీసీహెచ్ ఎలక్ట్రానిక్స్ ఆస్తులు అటాచ్
ABN , First Publish Date - 2022-04-08T01:51:22+05:30 IST
పీసీహెచ్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్నకు చెందిన ఆస్తులను అటాచ్
హైదరాబాద్: పీసీహెచ్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్నకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, బెంగళూరు నగరాలలో ఉన్న 11 ఆస్తులను అటాచ్ చేసింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో పీసీహెచ్ గ్రూప్నకు చెందిన రూ.6.18 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తులను పీసీహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్ బినామీ ఆస్తులగా ఈడీ గుర్తించింది. వివిధ బ్యాంకుల నుంచి రూ.747 కోట్ల రుణాన్ని పీసీహెచ్ తీసుకుంది.