విజయవాడలో కత్తితో దాడి
ABN , First Publish Date - 2021-12-25T23:04:00+05:30 IST
నగరంలోని ఆటోనగర్ బస్ టెర్మినల్ దగ్గర
విజయవాడ: నగరంలోని ఆటోనగర్ బస్ టెర్మినల్ దగ్గర దారుణం జరిగింది. షేక్ జిలాని అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేసి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దాడికి ఆర్థిక లావాదేవీలే కారణమని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. శేషు అనే వ్యక్తిపై జిలాని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.