మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2020-11-29T17:52:06+05:30 IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడి చేశాడు.

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి పేర్ని నాని అనుచరులు నిందితుడిని పట్టుకోవడం ప్రమాదం తప్పింది. మంత్రిని కలవడానికి అని వచ్చిన ఓ వ్యక్తి ఆయన కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేశారు. దండం పెడుతూ ఒక్కసారిగా తాపీని తీసి మంత్రిపై దాడికి యత్నించాడు. అయితే అనుచరులు వెంటనే అడ్డుకోవడంతో మంత్రి పేర్ని నాని సురక్షితంగా బయటపడ్డారు. నిందితుడిని పట్టుకున్న మంత్రి అనుచరులు అతడిని పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి తాపీమేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. నిందితుడు మద్యం మత్తులో దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. మంత్రి నివాసంలోనే దాడి జరగడం సంచలనం సృష్టిస్తోంది.

Updated Date - 2020-11-29T17:52:06+05:30 IST