పాత కక్షలతో వ్యక్తిపై దాడి

ABN , First Publish Date - 2021-10-17T04:33:48+05:30 IST

పాత కక్షలతో చేసిన దాడితో ఓ వ్యక్తి మృ తి చెందాడు.

పాత కక్షలతో వ్యక్తిపై దాడి

- చికిత్స పొందుతూ మృతి

కేటీదొడ్డి, అక్టోబరు 16 : పాత కక్షలతో చేసిన దాడితో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై కురుమ య్య తెలిపిన వివరాల ప్రకారం గువ్వలదిన్నె గ్రామానికి చెందిన చాట మాశప్ప (48)కు, అదే గ్రామానికి చెందిన రంగప్పకు పాతకక్షలు ఉన్నాయి. గతంలో కూడా ఇరువురుపై కేసులు ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం చాట మాశప్ప తన వ్యవసాయ పొలం నుంచి ఒంటరిగా వస్తుండగా రైల్వే బ్రిడ్జి దగ్గర రంగప్ప, కండేప్ప, ఉపేందర్‌, తిమ్మప్ప కట్టేలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన  మాశప్పను కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-10-17T04:33:48+05:30 IST