డ్రైవర్పై దాడి.. మనస్తాపంతో ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-23T04:53:14+05:30 IST
ఓ గొడవ విషయంలో గ్రామస్థులు దాడి చేయడంతో మనస్తాపానికి గురైన టిప్పర్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రాయపోల్, ఏప్రిల్ 22: ఓ గొడవ విషయంలో గ్రామస్థులు దాడి చేయడంతో మనస్తాపానికి గురైన టిప్పర్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోనాయిపల్లి గ్రామానికి చెందిన మహేష్(22) టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం గ్రామానికి చెందిన నలుగురితో మహే్షకు గొడవ జరిగింది. ఈ క్రమంలో మహే్షపై వారు దాడి చేశారు. మనస్థాపానికి గురైన మహేష్ అదోరోజు రాత్రి పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. తండ్రి జక్కుల నాగులు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.