తెనాలిలో కానిస్టేబుల్పై దాడి
ABN , First Publish Date - 2021-01-21T15:43:24+05:30 IST
గుంటూరు జిల్లా: తెనాలిలో హెడ్ కానిస్టేబుల్ పోలేశ్వరరావుపై దాడి జరిగింది.
గుంటూరు జిల్లా: తెనాలిలో హెడ్ కానిస్టేబుల్ పోలేశ్వరరావుపై దాడి జరిగింది. సుల్తానాబాద్లో మద్యం మత్తులో వెంకటేష్ నాయక్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో సంఘటన ప్రదేశానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ను వెంకటేష్ బైక్పై నుంచి కింద పడేసి దాడి చేశాడు. హెడ్ కానిస్టేబుల్ పోలేశ్వరావు తలకు తీవ్ర గాయం అయింది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.