స్థల వివాదంలో మహిళపై దాడి
ABN , First Publish Date - 2021-05-09T07:41:01+05:30 IST
స్థల వివాదం విషయంలో మహిళపై దాడి చేసిన ఆరుగురిపై శనివారం కేసు నమోదైంది.
ఆరుగురిపై కేసు నమోదు
కనిగిరి, మే 8 : స్థల వివాదం విషయంలో మహిళపై దాడి చేసిన ఆరుగురిపై శనివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పాతశంఖవరం గ్రామంలో గోడ విషయమై చీర్ల మంగమ్మకు, కాసుల బాలకోటేశ్వరరావుకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో బాలకోటేశ్వరరావు, మరో ఐదుగురితో కలిసి మంగమ్మపై కర్రతో దాడి చేయగా గాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.