సినీ రచయిత చిన్నికృష్ణపై దాడి.. అసలేం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2022-02-20T14:40:04+05:30 IST

సినీ రచయిత చిన్నికృష్ణపై దాడి.. అసలేం జరిగిందంటే..!

సినీ రచయిత చిన్నికృష్ణపై దాడి.. అసలేం జరిగిందంటే..!

  • పోలీసులకు ఫిర్యాదు


హైదరాబాద్ సిటీ/శంకర్‌పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలోని సార్క్‌వన్‌లో సినీ రచయిత చిన్నికృష్ణపై కొందరు దాడి చేశారు. తన విల్లా పక్కన ఉన్న గ్రామపంచాయతీ స్థలాన్ని కబ్జా చేశారంటూ కమ్యూనిటీ ఈసీ మెంబర్‌ వేణుమాధవ్‌, దీపక్‌ కీని, తరుణ్‌ మేకల వారి అనుచరులు దాడి చేశారని చిన్నికృష్ణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న 150 గ్రాముల బంగారం, రూ.5 లక్షల విలువ గల డైమండ్‌ రింగ్‌, తన తండ్రి ఎంతో ప్రేమతో ఇచ్చిన కలాన్ని(పెన్‌) దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీపీ రవీందర్‌రెడ్డి, శంకర్‌పల్లి సీఐ మహేష్ గౌడ్‌, ఎస్‌ఐ కృష్ణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం చిన్నికృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తాను భూమిని కబ్జా చేయలేదని పేర్కొన్నారు.

Updated Date - 2022-02-20T14:40:04+05:30 IST