ఘాతుకం: ప్రేమించలేదని బాలికపై వేడి నూనెతో దాడి

ABN , First Publish Date - 2020-07-02T13:45:47+05:30 IST

బాలికపై వేడి నూనె పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుదుచ్చేరి రాష్ట్రం కిరుమాంబాక్కం ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల

ఘాతుకం: ప్రేమించలేదని బాలికపై వేడి నూనెతో దాడి

చెన్నై: బాలికపై వేడి నూనె పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పుదుచ్చేరి రాష్ట్రం కిరుమాంబాక్కం ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల మాదేష్‌ అనే యువకుడు ప్రేమించాడు. దీనికి బాలిక అంగీకరించకపోవడంతో గత నెల 18వ తేదీ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై వేడి నూనె పోశాడు. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక ఫిర్యాదుతో కిరుమాంబాకం పోలీసులు కేసు నమోదుచేసి, పరారీలో ఉన్న మాదేష్‌ను మంగళవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2020-07-02T13:45:47+05:30 IST