‘దాడులకు పాల్పడితే సహించేది లేదు’

ABN , First Publish Date - 2021-01-25T05:39:44+05:30 IST

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో మొన్న కమలాపూర్‌, నిన్న యానంపల్లిలో బీజేపీ కార్యకర్తలపై దాడులు శోచనీయమని బీజేపీ రూరల్‌ ఇన్‌చార్జి దినేష్‌కుమార్‌ ఖండించారు.

‘దాడులకు పాల్పడితే సహించేది లేదు’

డిచ్‌పల్లి, జనవరి 24: నిజామాబాద్‌  రూరల్‌ నియోజకవర్గంలో మొన్న కమలాపూర్‌, నిన్న యానంపల్లిలో బీజేపీ కార్యకర్తలపై దాడులు శోచనీయమని బీజేపీ రూరల్‌ ఇన్‌చార్జి దినేష్‌కుమార్‌ ఖండించారు. ఆదివారం సాయంత్రం జి ల్లా ఆసుపత్రిలో కోలుకుంటున్న బీజేపీ కార్యకర్తలను సీనియర్‌ నాయకులు పరామర్శించారు. అనంతరం డిచ్‌పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామ ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అనుచరులే ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, గద్దె  భూమన్న, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-01-25T05:39:44+05:30 IST