ఏపీ సర్కార్‌పై ఉద్యోగుల ముప్పేట దాడి

ABN , First Publish Date - 2022-01-19T22:07:05+05:30 IST

ఏపీ సర్కార్‌పై ఉద్యోగులు ముప్పేట దాడికి

ఏపీ సర్కార్‌పై ఉద్యోగుల ముప్పేట దాడి

అమరావతి: ఏపీ సర్కార్‌పై ఉద్యోగులు ముప్పేట దాడికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ, సీపీఎస్ ఉద్యోగుల సమ్మె బాట పట్టారు. తాజాగా ఈ గూటికి సచివాలయ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా చేరుతున్నారు. ఉద్యమ కార్యాచరణకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సిద్ధమవుతోన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పీఆర్సీలో తమకు న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడు మొక్కుబడి ఇంక్రిమెంట్లు కాకుండా ధరల సూచీ ఆధారంగా జీతం పెంపు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 


Updated Date - 2022-01-19T22:07:05+05:30 IST