నల్లమలలో ఫారెస్టు అధికారుల దాడులు

ABN , First Publish Date - 2021-11-29T05:48:05+05:30 IST

నల్లమలలో భాగంగా రుద్రవరం రేంజిలోని నూతల సౌత్‌బీట్‌లో ఆదివారం దాడులు నిర్వహించి 35 టేకు దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్‌ శ్రీపతినాయుడు తెలిపారు.

నల్లమలలో ఫారెస్టు అధికారుల దాడులు

  1. 35 టేకు దుంగలు స్వాధీనం 
  2. ఆరుగురు స్మగ్లర్ల అరెస్టు 


రుద్రవరం, నవంబరు 28: నల్లమలలో భాగంగా రుద్రవరం రేంజిలోని నూతల సౌత్‌బీట్‌లో ఆదివారం దాడులు నిర్వహించి 35 టేకు దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్‌ శ్రీపతినాయుడు తెలిపారు. ఈదాడుల్లో మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన గుర్రం ప్రభుదాసు, కొత్తమాసి కుమార్‌, గుర్రం దానం, గుర్రం రాముడు, చిట్టిగాళ్ల ఓబులేసు, ఆవుల ఓబులేసు అనే స్మగ్లర్లను అరెస్టు చేసి ఆళ్లగడ్డలో మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించినట్లు రేంజర్‌ తెలిపారు. వీటి విలువ రూ.1.50లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజి ఆఫీసర్‌ నాగేంద్రనాయక్‌, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్లు రాణెమ్మ, నాగరాజు, సుబ్బయ్య, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్లు రామకృష్ణ, ఉసేన్‌బాషా, మద్దిలేటి పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-29T05:48:05+05:30 IST