ఆదివాసీలపై దాడులు సరికాదు

ABN , First Publish Date - 2022-06-28T04:13:55+05:30 IST

ఆదివాసీ, పేదలపై అటవీ శాఖ అధికారులు దాడుల చేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొ న్నారు. సోమవారం పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ, గిరిజనుల రైతులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ శాఖ అధికారుల ద్వారా ఆదివాసీ, పేదలపై దాడులు, దౌర్జన్యాలు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివాసీలపై దాడులు సరికాదు
కలెక్టరేట్‌ ధర్నాలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 27: ఆదివాసీ, పేదలపై అటవీ శాఖ అధికారులు దాడుల చేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొ న్నారు. సోమవారం పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ, గిరిజనుల రైతులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ శాఖ అధికారుల ద్వారా ఆదివాసీ, పేదలపై దాడులు, దౌర్జన్యాలు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దండేపల్లి మండలం కోయపోచగూడెంలోని ఆదివాసీ మహిళలు, చంటి పిల్లల తల్లులను జైలులో పెట్టడం హేయమైన చర్యఅన్నారు. ప్రభుత్వాల అం డతో అటవీశాఖ అధికారులు పోడు భూములను సాగు చేసుకోనివ్వడం లేద న్నారు. ఆదివాసీ, పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రా లు ఇవ్వడం లేదన్నారు. క్రీడా మైదానాల పేరుతో పేదల భూములను, ఇంటి స్థలాలను లాక్కుంటున్నారని ఇది సరైంది కాదన్నారు. అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, పింఛన్‌లు మంజూరు చేయడం లేదని, దళిత బంధుని అధి కార బంధువుగా చేశారని తెలిపారు.  నాయకులు బండారి రవికుమార్‌, ఆశన్న,  ఎర్మ పున్నం, సంకె రవి, ఆదివాసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T04:13:55+05:30 IST