అత్తామామల వేధింపులవల్లే

ABN , First Publish Date - 2020-11-25T04:55:06+05:30 IST

అత్తామామల వేధింపుల వలనే తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఓ మైనర్‌ వివాహిత మంగళవారం ఆరోపించింది.

అత్తామామల వేధింపులవల్లే

తన భర్త ఆత్మహత్యాయత్నం

విలేకరుల ఎదుట బాధితురాలు

సత్తుపల్లిరూరల్‌, నవంబరు 24: అత్తామామల వేధింపుల వలనే తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఓ మైనర్‌ వివాహిత మంగళవారం ఆరోపించింది. మనస్థాపం చెందిన ఆమె శానిటైజర్‌ మింగి స్థానిక ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విలేకర్లతో మాట్లాడింది. గతవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మండలంలోని కిష్టారంకు చెందిన మొండ్రు అశోక్‌ విజయవాడలో చికిత్స పొందుతూ విషమ పరిస్థితిలో ఉన్నాడు. ఈనెల 18న పెద్దల సమక్షంలో పెళ్లి అయిన తర్వాతి నుంచి భర్తను ఆయన తల్లీదండ్రులు, బంధువులు సూటిపోటీ మాటలతో మానసికంగా హింసించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పింది. ఈ విషయంలో తనకు తన భర్తకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది. ఈ మే రకు పోలీస్‌ స్టేషన్‌లో ఎటువంటి కేసు నమోదవ్వలేదు.


Updated Date - 2020-11-25T04:55:06+05:30 IST