ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం

ABN , First Publish Date - 2022-01-23T04:58:31+05:30 IST

ఆక్రమణకు య త్నిస్తున్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవె న్యూ అధికారులు అడ్డుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది.

ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం
ముసల్‌రెడ్డిపల్లెలోని ప్రభుత్వ భూమి ఇదే

 అడ్డుకున్న రెవెన్యూ అధికారులు 

పోరుమామిళ్ల, జనవరి 22 : ఆక్రమణకు య త్నిస్తున్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవె న్యూ అధికారులు అడ్డుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..  పోరుమామిళ్ల మండలంలోని ముసల్‌రెడ్డిపల్లె గ్రామ సర్వే నెంబర్‌ 134, 135, 136లలో ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన సయ్యద్‌ ఖాజాపీర్‌, షఫీ అనే వారు ఆక్రమించుకొని ట్రాక్టర్లతో చదును చేస్తుండగా విషయం తెలసుకున్న ఆర్‌ఐ సిద్దేశ్వరయ్య సిబ్బందితో వెళ్లి ఆక్రమణను అడ్డుకొని డోజర్‌ను పోలీ్‌సస్టేషన్‌కు అప్పజెప్పారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించుకున్నా వారి పై కఠిన చర్యలు తప్పవని ఆర్‌ఐ సిద్దేశ్వరయ్య హెచ్చరించారు. 


Updated Date - 2022-01-23T04:58:31+05:30 IST