ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

ABN , First Publish Date - 2022-05-22T06:36:57+05:30 IST

పట్టణంలోని టీటీడీ కల్యాణమండపం వద్ద జాతీయ రహదారి పక్కన విలువైన భూమిని కొందరు కబ్జాకు యత్నించారు.

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
ప్రభుత్వ భూమిలో చదును చేస్తున్న ఆక్రమణదారులు

అడ్డుకున్న తహసీల్దార్‌


పెనుకొండ రూరల్‌, మే 21: పట్టణంలోని టీటీడీ కల్యాణమండపం వద్ద జాతీయ రహదారి పక్కన విలువైన భూమిని కొందరు కబ్జాకు యత్నించారు. శనివారం ఎక్సాకవేటర్‌తో ఆ భూ మిని చదును చేస్తుండగా, సమాచారం అందుకున్న తహసీల్దార్‌ నాగరాజు వెంటనే రంగంలోకి దిగారు. ప్రభుత్వ భూమిలో అక్ర మంగా చేస్తున్న పనులు నిలిపివేశారు. టీటీడీ కల్యాణమండపం సమీపంలో జాతీయరహదారి పక్కన సర్వే నంబరు 194-1లో 11 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఇదివరలో తహసీల్దార్‌గా విధులునిర్వహించిన హసీనాసుల్తానా ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బో ర్డు ఏర్పాటు చేశారు. శనివారం పట్టణానికి చెందిన కొందరు ఆక్రమణదారులు ఎక్సాకవేటర్‌తో భూమి చదును పనులు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ నాగరాజు స్థలం వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ భూమిలో మీరు పనులు ఎందుకు చేస్తున్నారు? ఎవరు అనుమతి ఇచ్చారంటూ ఆక్రమణదారులను ప్రశ్నించారు. పంచాయతీ అనుమతివ్వడంతో పనులు చేపడుతున్నట్లు ఆక్రమణదారులు చెప్పుకొచ్చారు. దీంతో తహసీల్దార్‌, ఆక్రమణదారుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ భూమిలో ప నులు చేపట్టకూడదని, వేసుకున్న షెడ్డు నిర్మాణం సాయంత్రంలో పు తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై తహసీల్దార్‌ నాగరాజును వివరణ కోరగా, ప్రభుత్వ భూముల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామన్నారు.  నగర పంచాయతీ కమిషనర్‌ వంశీకృష్ణ, చైర్మన ఉమర్‌ఫారూక్‌ను వివరణ కోరగా, ప్రభుత్వ స్థలంలో తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-22T06:36:57+05:30 IST